Jul 31,2023 21:45
  • ఐర్లాండ్‌ టూర్‌కు జట్టు ఎంపిక

ముంబయి : స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా ఐర్లాండ్‌తో టీ20ల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకుని ఎన్‌సీఏలో పూర్తి స్థాయి బౌలింగ్‌ సాధన చేస్తున్న బుమ్రా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సెలక్షన్‌ కమిటీ టీ20 జట్టును సోమవారం ప్రకటించింది. తెలుగు తేజం తిలక్‌ వర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
టీ20 జట్టు : బుమ్రా (కెప్టెన్‌), గైక్వాడ్‌, జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌, జితేశ్‌ శర్మ, శివం దూబె, వాషింగ్టన్‌, షాబాజ్‌ , బిష్ణోరు, ప్రసిద్‌ కృష్ణ, అర్షదీప్‌ , ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌.