Mar 31,2023 08:57

అమరావతి : బోయ వాల్మీకి లను ఎస్‌టి జాబితాలో చేర్చాలని వైసిపి అధినేత సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దానికి వ్యతిరేకంగా ... ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది.

Bandh-of-tribal-societies-across-the-state-today



విశాఖ : మన్యం : రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా ... మన్యంలోనూ సిపిఎం ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌, వైస్‌ ఎంపిపి సత్యనారాయణ మాట్లాడుతూ ... ప్రత్యక్ష పోరాటంలో పాల్గొని బంద్‌ను జయప్రదం చేస్తున్నామన్నారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

22



చింతపల్లి : గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతపల్లి మండల కేంద్రంలో ఉదయం 7 గంటల నుండి బంద్‌ కొనసాగుతోంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా :
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు వద్ద మన్యం బంద్‌ సంపూర్ణం. బంద్‌ లో గిరిజన సంఘం మండల నాయకులు పాంగి. సురేష్‌ కుమార్‌, పాంగి. సత్యనారాయణ, వంతాల. రామమూర్తి, యువకులు పూజారి.శివ, కొర్రాయి.సర్పంచ్‌ పూజారి, కొములు, కినుబుడి.సురేష్‌, ఎస్‌ఎప్‌ఐ నాయకులు పాంగి.సారేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

555



డుంబ్రిగుడ : మండల కేంద్రంలో బంద్‌ కొనసాగుతోంది. రంపచోడవరంలోనూ బంద్‌ కొనసాగుతోంది. చింతలవీధి పంచాయతీ పరిధిలో ఉబ్బాడిపుట్టు గ్రామంలో, లమ్మసింగిలో బంద్‌ కొనసాగుతోంది.

667


 

779