
జాయ్ నగర్ : ''పోలీసుల ఎదుటే తణమూల్ కి చెందిన రౌడీ మూకలు సిపిఐ(ఎం) మద్దతుదారుల ఇళ్లను తగులబెట్టాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ వచ్చినప్పుడు తణమూల్ వారు రోడ్డును అడ్డుకున్నారు'' అని జయనగర్లో తణమూల్ నాయకుడి మరణం తరువాత దాలు అఖంకి గ్రామంపై ఈ మూకలు దాడి చేసి ఇళ్లకు నిప్పుపెట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బమంగాచ్చి పంచాయతీ సభ్యుడు, తణమూల్ అధ్యక్షుడు సైఫుద్దీన్ లస్కర్ సోమవారం ఉదయం తన ఇంటికి 100 మీటర్ల దూరంలోని మసీదు వద్ద ప్రార్థనలు చేసేందుకు వెళుతుండగా ఆ సమయంలో మసీదు ముఖద్వారం వద్ద బైక్లపై వచ్చిన కొందరు అతడిని చుట్టుముట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని అక్కడే పట్టుకుని కొట్టి చంపారు. పట్టుబడిన వ్యక్తి జయనగర్కు చెందిన వ్యక్తి కాదు. బయటి నుంచి వచ్చిన వ్యక్తి అని అనుమానిస్తున్నారు. ''ఈ ఘటన తెలియగానే మా గ్రామంపై దుష్టశక్తుల గుంపు హఠాత్తుగా దాడి చేసింది. తగులబెట్టిన ఇళ్లన్నీ అట్టడుగు వర్గాలకు చెందినవారివే.