Nov 06,2023 21:09

   టి.నరసాపురం : ఈనెల 8న మండలంలో జరిగే బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలని జెడ్‌పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు(సూరిబాబు) పిలుపునిచ్చారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం వైసిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గ పరిధిలో ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 200ల రోజులు పూరైన సందర్భంగా ఈనెల 8న మండలంలోని బొర్రంపాలెం అడ్డరోడ్డు నుంచి టి.నరసాపురం వరకు భారీ సంఖ్యలో బైక్‌ ర్యాలీ, అనంతరం టి.నరసాపురంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ ఎస్‌విపికెహెచ్‌.శ్రీను రాజు, కె.జగ్గవరం పిఎసిఎస్‌ అధ్యక్షులు వాసిరెడ్డి మధు పాల్గొన్నారు.