
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
స్థానిక సర్ సిఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 61 మంది విద్యార్థులు రక్తదానం చేసినట్లు జిల్లా రెడ్క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించగలిగేలా విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెవి.విష్ణు మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ కెఎ.రామరాజు, డాక్టర్ ఆర్ఎస్ఆర్కె.వరప్రసాదరావు, పీజీ కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాసరావు, ఎన్సిసి ఆఫీసర్ నవీన్, పిఆర్ఒ కెవి.రమణ పాల్గొన్నారు.