
ప్రజాశక్తి - కలిదిండి
మండలంలోని మట్టగుంటలో హౌలీ చర్చి జెఎంసి ఫౌండేషన్ జాన్ మంగాచార్యులు ఆర్థిక సాయంతో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఏలూరు విజయ విజనరీ సెంటర్ వైద్యులు కంటి, కంటినరం పరీక్షలు చేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న సుమారు 200 మందికి పరీక్షలు చేసి, 150 మందికి కళ్లజోళ్లు, మందులు పంపిణీ చేశారు. గ్రామాల్లో జెఎంసి ఫౌండేషన్ జాన్ మంగాచార్యులు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర టిడిపి బిసి సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు అన్నారు. మాజీ సర్పంచి ఎ.కృష్ణ మూర్తి, తిరుమాని నాగరాజు, బళ్లరాజు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.