Nov 13,2023 21:16

ప్రజాశక్తి - నిడమర్రు
       ఈనెల 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ మండలం లోని క్రొవ్విడి, భావాయిపాలెం, సిద్ధాపురం గ్రామాల్లో సిపిఎం కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ కరపత్రాలు పంచి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్‌ నారపల్లి రమణారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెలగలేటి మోహన్‌, లావేటి చంద్రరావు, వెంకన్న, సోమేశ్వరరావు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : ప్రజారక్షణ భేరి బహిరంగసభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు పెద్దఎత్తున సభకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రచారభేరి గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మొడియం నాగమణి, నాయకులు ఎస్‌.శివకుమార్‌, చెరుకూరి మరిడియ, పి.తమ్మారావు, గోపి, మర్రి త్రిమూర్తులు, ముప్పిడి సురేష్‌, నాగేశ్వరరావు, దుర్గారావు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్‌:సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి భారీ ప్రదర్శన, బహిరంగ సభలో చేతి వృత్తిదారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎపి చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ పిచ్చుక ఆదిశేషు, జిల్లా కో కన్వీనర్‌ ఆగొల్లు వెంకటకృష్ణారావులు సోమవారం పిలుపునిచ్చారు. ఉదయం పది గంటలకు విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఫుడ్‌ జంక్షన్‌ నుండి అజిత్‌ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకూ ప్రదర్శన, అనంతరం 11 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌, ఎస్‌.పుణ్యవతి సీనియర్‌ నాయకులు పి.మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.రమాదేవి, సిహెచ్‌.బాబూరావు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.