Nov 08,2023 17:53

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
    ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ తలసేమియా భవనంలో బుధవారం 15 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లైన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ గట్టు మాణిక్యాలరావు చిన్నారులను పరామర్శించి వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల రక్తమార్పిడికి అవసరమయ్యే ఫిల్టర్‌ సెట్‌లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి రెడ్‌క్రాస్‌ ద్వారా మంచి సేవా కార్యక్రమాలను చేస్తున్నారని తెలిపారు. తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 40 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత రత్న కుమారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కెబి.సీతారాం, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ వర ప్రసాద్‌ రావు, లైన్స్‌క్లబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తకరాల వేణు, సిహెచ్‌.అవినాష్‌ రాజు, లైన్స్‌క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.