Aug 17,2023 22:15

తొలి భారతీయుడిగా ఘనత
లండన్‌: భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షులు 65 ఏళ్ల అదిల్లే సుమరివల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఎక్జిక్యూటివ్‌ బోర్డు ఉపాధ్యక్షుడిగా గురువారం ఎంపికయ్యారు. దాంతో, ఈ పదవిని అలంకరించిన తొలి భారతీయుని సుమరివల్లా గుర్తింపు సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు. నాలుగేళ్ల పాటు సుమరివల్లా ఈ హోదాలో కొనసాగనున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఎక్జిక్యూటివ్‌ బోర్డులో అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు అపాయింటెడ్‌ సభ్యులు, ఒక నాన్‌ ఓటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఉంటారు. సుమరివల్లాతో పాటు క్సిమెనా రెస్ట్రెపో, రౌల్‌ చాపడో, జాక్సన్‌ టువెల్‌ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2012 నుంచి భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడిగా సమరివల్లా కొనసాగుతున్నారు. అలాగే 2015 నుంచి ప్రపంచ అథ్లెటిక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నాడు.