Apr 22,2023 22:28

annadanam

కొసరాజు వేంకటాద్రి చౌదరి వర్థంతి
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
స్థానిక లయన్స్‌ సేవా భవనంలో శనివారం లయన్‌ కొసరాజు వేంకటాద్రి చౌదరి వర్థంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో పూర్వ గవర్నర్‌ లయన్‌ పుట్టగుంట సతీష్‌ చేతులమీదుగా అన్నదానం, పండ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు సింగంశెట్టి ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైపిసి ప్రసాద్‌, కొసరాజు బాపయ్య చౌదరి, గుడ్లవల్లేరు, గుడివాడ లయన్‌ సభ్యులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.